భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్.టి.ఐ, నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ వైస్ చైర్మన్, శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ నీలం సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కోట మండలం విద్యానగర్ గ్రామంలోని శ్రీనివాసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పలువురు చిన్నపిల్లలకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
అనంతరం నీలం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు రెండు పోలియో చుక్కలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు బాధ్యతగా సమీపంలోని పల్స్ పోలియో కేంద్రాలకు వెళ్లి తమ పిల్లలకు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని కోరారు. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో చెందోడు పరిధికి చెందిన ఆరోగ్య కార్యకర్తలు చిన్నారులకు చుక్కల మందు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నీలం సురేందర్ రెడ్డితో పాటు శ్రీమతి చంద్రలేఖ, స్థానిక ఆరోగ్య సిబ్బంది, చెందోడు గ్రామ ప్రజలు, మరియు కొత్తపాలెం రోడ్డు ప్రాంతానికి చెందిన నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
విద్యానగర్లో పల్స్ పోలియో కార్యక్రమం
Quick Summary:
చిన్నారులకు చుక్కలు వేసిన నీలం సురేందర్ రెడ్డి