చిల్లకూరు, జూలై 1 (ప్రజా అంతరంగం)
ఎల్ నినో ప్రభావం తో ప్రపంచ దేశాలపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో అయన మాట్లాడారు . గురువారం అయన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నెల్లూరు జిల్లాకు విచ్చేసిన విషయం తెలిసిందే . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల వర్షాలు బాగా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూరోప్ దేశాల్లో ఎండవేడిమి ప్రభావం చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటూ, గతంలో మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రతను తగ్గించడానికి విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు స్ప్రేయింగ్ చేయించిన విధానాన్ని ఇప్పుడు యూరోప్లోనూ అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. గత ఏడాది పడిన వర్షాల వల్ల గోదావరి, కృష్ణా నదులు పొంగిపొర్లినప్పుడే ముందుచూపుతో రిజర్వాయర్లను నింపామని, అందుకే ఈ ఏడాది ఇప్పటివరకు నదుల్లో కొత్త ప్రవాహాలు రాకపోయినా ప్రాజెక్టుల్లో 65 శాతం మేర నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వర్షాలు తగ్గుతున్న తరుణంలో భూగర్భ జలమట్టాన్ని పెంచి భూమినే ఒక జలాశయంగా మార్చేందుకు ‘జలధార’ లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తులో గోదావరి-కావేరి నదులను అనుసంధానం చేయడం ద్వారా దిగువన ఉన్న రాష్ట్రాలకు కూడా నీరిచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రౌడీయిజం, అరాచకాలతో పబ్బం గడుపుకోవాలనేదే వైసీపీ నేతల ఆలోచన అని, ‘గొడ్డలి పార్టీ నెవర్ అగైన్’ అనే సంకల్పం ప్రజలు చేయాలని పిలుపునిచ్చారు. తాము యజ్ఞంలా అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. గత పాలకుల అస్తవ్యస్త నిర్ణయాల వల్ల మూడు రాజధానుల పేరిట గందరగోళం సృష్టించి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతిలో వేగంగా పనులు జరుగుతుంటే సహించలేక రౌడీలతో దండయాత్రలు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. గత పాలనలో రాష్ట్రాన్ని గంజాయికి అడ్డాగా మారిస్తే, తాము అధికారంలోకి వచ్చాక ‘ఈగల్ టాస్క్ఫోర్స్’ ద్వారా నియంత్రించామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులతో విషప్రచారం చేస్తున్నారని, హోం మంత్రి అనిత మేకప్పై ఆ పార్టీ నేతలు అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుక ఉన్న ‘సైకో’ సహకారం లేకపోతే ఆ నేతలు ఇంత విచ్చలవిడిగా మాట్లాడలేరని విమర్శించారు. నేరస్థులను జైల్లో పెట్టడం తమకు ఒక్క నిమిషం పని అయినప్పటికీ, తాము ప్రతీకార రాజకీయాలు చేయడం లేదని, తమ దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధిపైనే ఉందన్నారు. ‘ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్’ అన్నదే మన నినాదం కావాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
మరోవైపు పర్యావరణ, పారిశ్రామిక అభివృద్ధి అంశాలపై మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గాయని, గత ఏడాది విజయవాడలో రోడ్లపై నీళ్లు స్ప్రేయింగ్ చేసి ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రయత్నం చేయగా, ఇప్పుడు యూరోప్లోనూ అదే విధానాన్ని అనుసరిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది నదుల్లో ప్రవాహాలు రాకపోయినా రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలు ఉన్నాయని, భూమినే జలాశయంగా మార్చేలా ‘జలధార’ కార్యక్రమం చేపట్టామన్నారు. త్వరలోనే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధాల వల్ల ఇంధన ధరలు పెరిగిన తరుణంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచాలని, ఇందుకు అవసరమైన మొక్కజొన్న లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లాలని కోరారు. పరిశ్రమలను తరిమికొట్టడం సులువే కానీ తీసుకురావడం కష్టమని పేర్కొంటూ, గతంలో కర్ణాటకకు వెళ్లాల్సిన హీరో మోటార్స్ సంస్థను ఏపీకి తీసుకొచ్చి బైక్ల ఉత్పత్తి జరిగేలా చేశామన్నారు. కడపలో ‘రాయలసీమ స్టీల్ ప్లాంట్’కు రేపు శంకుస్థాపన చేయబోతున్నామని, 2028 నాటికి అక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు
Andhra
అభివృద్ధిని అడ్డుకుంటే సహించం- సీఎం చంద్రబాబు నాయుడు
Quick Summary:
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్.. ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్

